ప్రకాశం: సీఎస్పురం మండలం రేగులచిలకలో ఎండిపోయిన పంటలను రైతు సంఘం నాయకులు యారవ వెంకటసుబ్బయ్య, జవ్వాజి మోహన్, నాగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో వందలాది ఎకరాలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సీఎస్పురాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘సీఎస్పురాన్ని కరువు మండలంగా ప్రకటించాలి’


