WGL: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పొలాల్లో డ్రిప్ పేపర్ పరుస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై సమ్మయ్య, అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి నరేశ్కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి


