హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలి'

NRML: నిర్మల్‌లో బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని, పీఎల్‌ఐ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహించారు. శుక్రవారం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మరోసారి సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు.