హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

NLG: నూతన సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్‌ తియాన్‌ మావిని జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యులు యేకుల అనిత సురేష్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్‌ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలు అర్హులకు సకాలంలో అందేలా చూడాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని సబ్‌ కలెక్టర్‌ తెలిపారు.