హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫీల్డింగ్‌పై మాకెలాంటి ఆందోళన లేదు: దీప్తి శర్మ

మహిళల ఆసియాకప్‌లో భారత ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. సెమీస్‌లో పలు అవకాశాలను టీమిండియా ఫీల్డర్లు జారవిడిచారు. దీనిపై దీప్తి శర్మ స్పందించింది. జట్టుగా తాము ఫీల్డింగ్‌పైనా కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. 'తుది పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంటాం. ఫైనల్‌లో ఏ టీమ్ వచ్చినా సమష్టిగా రాణించి కప్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తాం' అని వెల్లడించింది.