హైదరాబాద్: 28°C
క్రీడలు

షెఫాలీ వర్మ అరుదైన రికార్డు

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన షెఫాలీ వర్మ అరుదైన రికార్డు సాధించింది. ఈ ఏడాది టీ20ల్లో భారత మహిళల జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో షెఫాలీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఆమె 20 ఇన్నింగ్స్‌ల్లో 593 పరుగులు చేసింది. ఈ జాబితాలో స్మృతి మంధాన 590 పరుగులు (18 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో కొనసాగుతోంది.