హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పింఛన్లకు 14 వేల దరఖాస్తులు

CTR: NTR భరోసా పింఛన్ పథకం కింద సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, గురువారం నాటికి చిత్తూరు జిల్లాలో 14 వేలకు పైగా దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. సర్వర్ సామర్థ్యం పెంచడంతో దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు వేగవంతమైంది. లబ్ధిదారుల రద్దీతో గ్రామ, వార్డు సచివాలయాలు కళకళలాడాయి. ఇవాళ మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.