హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక ఉత్సవాలపై కమిషనర్ సమీక్ష

GNTR: వినాయక చతుర్థి ఉత్సవాలను గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జీఎంసీ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవతో కలిసి కలెక్టరేట్‌లో ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.