హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'

KMM: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి పోలీసు శాఖకు సహకరించాలని సీపీ సునీల్‌దత్‌ కోరారు. మండపాల నిర్వాహకులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, భద్రతా చర్యలు, డీజేల నియంత్రణ, శబ్ద కాలుష్య నివారణ, ట్రాఫిక్‌, ఊరేగింపులో నిబంధనలు పాటించాలని సూచించారు.