CTR: చిత్తూరు నగర పరిధిలోని మాపాక్షిలో పేకాట స్థావరంపై తాలూకా పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4,500 నగదు, మూడు బైక్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆరుగురు జూదరులు అరెస్ట్


