TPT: తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు తాకిడి పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరిగే బ్రేక్ దర్శనాలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఈ నెల 12 నుంచి 14 వరకు వరుస సెలవులు ఉన్న నేఫథ్యంలో రద్దీ మరింత పెరగనుంది. దీంతో శనివారం భక్తుల నుంచి ఎలాంటి సిఫారసు లేఖలూ స్వీకరించరు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణమిదే!


