హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం త్రైమాసిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ తెరిచి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రి, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతలో నిర్లక్ష్యానికి తావులేకుండా సీల్ విధానం సక్రమంగా ఉండాలని కోరారు.