హైదరాబాద్: 28°C
తెలంగాణ

సఖి కేంద్రాలను పరిశీలించిన న్యాయమూర్తి

సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను పరిశీలించారు. పిల్లల సంరక్షణ, పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని సూచించారు. బాధితులకు కౌన్సెలింగ్ ద్వారా న్యాయం చేయాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సౌజన్య ఈ సందర్భంగా కోరారు.