హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘లోక్ అదాలత్‌కు సద్వినియోగం చేసుకోవాలి’

ములుగు జిల్లా కోర్టులో సెప్టెంబర్ 12న జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, DLSA ఛైర్‌పర్సన్ ఎస్‌వీపీ సూర్యచంద్ర కళ తెలిపారు. రాజీపడదగు క్రిమినల్, సివిల్, బ్యాంకు, విద్యుత్, కుటుంబ, భూతగాదాలు, చెక్‌బౌన్స్, మోటార్ వాహన ప్రమాద తదితర కేసులను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.