MDK: చేగుంట మండల కేంద్రంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మండల స్థాయి క్రీడలు ముగిశాయి. వాలీబాల్, కబడ్డీ, కోకో పోటీలలో గెలుపొందిన విజేతలకు సర్పంచ్ స్రవంతి సతీష్, ఎంఈఓ నీరజ లు బహుమతులను ప్రధానం చేశారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో ప్రతిభ చూపాలని సూచించారు. పాఠశాల హెచ్ఎంలు పాల్గొన్నారు.
తెలంగాణ
ముగిసిన మండల స్థాయి క్రీడలు


