హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిక్సింగ్‌ ఆరోపణలు.. పాక్‌ ఆటగాళ్లకు సమన్లు

ఫిక్సింగ్ ఆరోపణలతో పాకిస్తాన్ క్రికెట్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లకు పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ ఇద్దరు ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను కూడా ఏజెన్సీ అధికారులు జప్తు చేసినట్లు తెలుస్తోంది.