హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

కృష్ణా: పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ (42) తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు.