హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: టెక్కలి మండలం రావివలసలోని సబ్ స్టేషన్-1 పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఈఈ నర్సింహకుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, కె.కొత్తూరు, రావివలస, ఎస్ఎస్ హెచ్ క్యూ, లింగాలవలస, తలగాం, బన్నువాడ, డివిజన్ కార్యాలయం, సంతోషిమాత ఆలయ ఫీడర్ల పరిధిలో మరమ్మతు పనుల దృష్ట్యా సరఫరా నిలిచిపోతుందన్నారు.