హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెగడపల్లిలో 6,428 మందికి SIR నోటీసులు

JGL:పెగడపల్లిలో 6,428 మంది ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. అన్ని పంచాయతీల్లో ఈ నెల 18 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి వివరాల్లో తప్పులు ఉండటంతో నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులు అందిన వారు ధ్రువపత్రాలతో బీఎల్‌ఓను కలవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.