WGL: వర్ధన్నపేట ఐకేపీ భవనంలో బృందావనం మండల మహిళ సమైక్య 10వ వార్షికోత్సవ మహాసభను గురువారం నిర్వహించారు. ఏపీఎం రమణాచారి పాల్గొని మహిళలు రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో సమైక్య అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి స్వర్ణలత, కోశాధికారి కల్పనతో పాటు సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సమైక్య 10వ వార్షికోత్సవం


