హైదరాబాద్: 28°C
క్రీడలు

రింకూనే కెప్టెన్‌ చేయాలి: ఆకాశ్‌ చోప్రా

IPL 2027లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రింకూ సింగ్‌ను కెప్టెన్‌గా నియమించాలని మాజీక్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. రహానే రిటైర్మెంట్‌తో కేకేఆర్‌కు కొత్త సారథి అవసరమైందన్నాడు. రింకూకు కెప్టెన్సీ అనుభవం ఉందని, యూపీ టీ20 లీగ్‌లో జట్టును విజేతగా నిలిపాడని గుర్తుచేశాడు. అతడికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నాడు.