SRPT: హుజూర్నగర్ మండలం సింగారంలో నీటి సమస్యపై తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. సైదమ్మ ఇంట్లోకి పక్కింటి వెంకన్న ఇంటి నీరు వస్తుండటంతో ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. నిన్న మరోసారి వాగ్వాదం జరగడంతో మద్యం మత్తులో వెంకన్న వేపకర్రతో సైదమ్మ, ఆమె కుమారుడు శ్రీనివాస్పై దాడి చేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తలిపారు.
తెలంగాణ
నీటి సమస్యపై గొడవ.. తల్లి, కొడుకుపై దాడి


