హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలు వాడాలి'

KMR: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని KMR అదనపు కలెక్టర్లు విక్టర్, NY గిరి పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను వారు బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. రసాయన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలన్నారు.