హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ సరఫరాపై ఎస్‌ఈ తనిఖీ

KNR: విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఏ. విజయేందర్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం చిగురుమామిడి సబ్‌స్టేషన్‌ను సందర్శించి సరఫరా పరిస్థితి, నిర్వహణ పనులను పరిశీలించారు. త్రీ ఫేజ్‌ సరఫరాలో లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.