హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ర్యాలీ

MDCL: శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తూంకుంటలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న సభాపతిని కించపరచడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన MLC సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.