NZB: నిజామాబాద్ రైల్వే స్టేషన్లో MHకు చెందిన బాలాజీ బాపురావు డాంగే అదృశ్యమైనట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఆయనకు కల్లు అలవాటు ఉండగా, అది దొరకకపోవడంతో మానసిక స్థితి కోల్పోయినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. ఈ నెల 7న తిరుపతి నుంచి నాందేడ్ వెళ్తున్న రైలులో నిజామాబాద్లో దిగి కనిపించకుండాపోయాడని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్లో మహారాష్ట్ర వ్యక్తి అదృశ్యం


