NLG: గత పాలకుల ఫామ్హౌజ్ వేదికగా దళితులపై విషపూరిత కుట్రలు సాగుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శాసనసభలో ఆరోపించారు. దళిత సమాజాన్ని అణచివేసేలా జరుగుతున్న ఈ కుట్రల నుంచి రక్షించేందుకు విద్యార్థులు, మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక దొర పాలనను ప్రజలు సాగనంపారని, మనల్ని మనమే రక్షించుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: దళిత వ్యతిరేక కుట్రలను తిప్పికొడదాం: MLA


