హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసుపుతో శుద్ధి చేయడం దుర్మార్గం: మంత్రి

HYD: దళితులు నిరసన తెలిపిన ప్రాంతంలో పసుపు చల్లి శుద్ధి చేయడం అత్యంత దుర్మార్గమని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు దళితులను అవమానిస్తున్నాయని ఆమె ఆరోపించారు. అణగారిన వర్గాలను అంటరానితనంతో చూసే భావజాలమే బీజేపీ, బీఆర్‌ఎస్‌లదని విమర్శించారు. రాహుల్‌ గాంధీని ఇబ్బంది పెట్టేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు.