హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం సదస్సుకు సమగ్ర ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి'

ELR: అమరావతిలో జరగనున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సుకు శాఖల వారీగా పూర్తిస్థాయి ప్రగతి నివేదికలను అందించాలని జిల్లా కలెక్టరు కే.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం అధికారులతో సమీక్షించారు. సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు తదితర ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో సాధించిన ప్రగతి, రాబోయే లక్ష్యాలపై ఖచ్చితమైన గణాంకాలతో వివరించాలన్నారు.