హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్-A జట్టులో హార్దిక్‌ పాండ్యా

ఆస్ట్రేలియా Aతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత A జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించింది. అయితే, అతడు తుది జట్టులో ఆడటం ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవ్వడం పైనే ఆధారపడి ఉంది. ఈ సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, దేవ్‌దత్ పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.