NLG: దేవరకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన వివిధ వాహనాలకు ఈనెల 11న వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.సాయికిరణ్ రెడ్డి తెలిపారు. వేలంలో పాల్గొనేవారు టూ వీలర్స్కు రూ.10 వేలు, ఫోర్ వీలర్స్కు రూ.30 వేలు అదే రోజు ఉదయం 8 గంటలకు డిపాజిట్ చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వాహనాలు కొనుగోలు చేయని వారికి డిపాజిట్ వెనక్కిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
ఈనెల 11న సీజ్ చేసిన వాహనాలకు వేలం


