హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సామాజిక అసమానతలపై పోరాడిన గొప్ప వ్యక్తి కాళోజీ'

SRD: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆయనకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ భాషా సంస్కృతులకు కాళోజీ గొప్ప స్థానం కల్పించారని కొనియాడారు. తన రచనల ద్వారా సామాజిక అసమానతలను నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారని, ఆయన అందించిన స్పూర్తి చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు.