హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ బృందం

HYD: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారంటూ బీఆర్‌ఎస్ నేతలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఘటన వివరాలను వివరించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాసనసభ్యుల హక్కులను పరిరక్షించాలని కోరారు.