SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో అప్పుల బాధతో గత నెల 24న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన దినసరి కూలీ జనగామ సత్యనారాయణ(35) చికిత్స పొందుతూ మంగళవారం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడికి భార్య మమత, పిల్లలు విగ్నేష్, పావనిశ్రీలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
అప్పుల బాధతో యువకుడు మృతి!


