హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ

మెదక్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. మండపాల వివరాలను పోలీసు పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఉచితంగా నమోదు చేసి ప్రతిని స్థానిక స్టేషన్‌లో ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక వసతులు సిద్ధం చేయాలని తెలిపారు. డీజేలు, మైకులపై రాత్రి 10 గంటల వరకు నిబంధనలు పాటించాలన్నారు.