హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండిపోయిన పేరూరు జలాశయం

సత్యసాయి: రామగిరి మండలంలోని పేరూరు అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. పెన్నానదిపై 1958లో రూ.1.20 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం వర్షాలు లేక నీరు చేరలేదు. మరోవైపు పనులు పూర్తిచేసి త్వరలోనే పేరూరు డ్యాంకు నీటిని అందిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత ఇటీవల ప్రకటించారు.