హైదరాబాద్: 28°C
క్రైమ్

బైక్‌ను ఢీకొన్న అంబులెన్స్‌.. ఇద్దరి మృతి

AP: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌ను ప్రైవేట్‌ అంబులెన్స్‌ ఢీకొట్టడంతో.. ఇద్దరు యువకులు మృతిచెందారు. పెరవలి మండలం పిట్టల వేమవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను నేలపూడి ప్రదీప్‌ (25), హరిదాసు సాయి (24)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.