హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

యూపీ భాగ్‌పత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ బాగడ్ ధామ్ దర్శనం ముగించుకుని 32 మంది భక్తులతో తిరిగి యూపీకి వస్తున్న పికప్ వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో పికప్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టగా అక్కడికక్కడే 12 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.