హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌ను కలిసిన విడదల రజిని

PLD: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి విడదల రజిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఇరువురూ చర్చించారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో వై‌సీపీ బలోపేతానికి చేపడుతున్న చర్యలను జగన్‌కు రజిని వివరించారు.