హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాజ్‌వే నిర్మాణానికి నిధుల మంజూరు

SDPT :బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల–వింజపల్లి రహదారిపై కాజ్‌వే నిర్మాణానికి రూ.1.75 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవతో పంచాయతీరాజ్‌ శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. కాజ్‌వే నిర్మాణంతో వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు తొలగి, రెండు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. నిధుల మంజూరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.