హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాస్వామ్యంపై అవగాహన అవసరం: విష్ణు రెడ్డి

WGL: విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై యువతకు అవగాహన అవసరమని యువ నాయకుడు విష్ణు రెడ్డి అన్నారు. బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన VAGMUN, తెలంగాణ స్టేట్ మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి బాధ్యతాయుతంగా చర్చించాలని, భిన్నాభిప్రాయాలను గౌరవించాలని సూచించారు.