BHPL: కాటారం మండలం జాదారావుపేటలో పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఎం.మౌనిక ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, జ్వరం వస్తే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ
జాదారావుపేటలో ఉచిత వైద్య శిబిరం


