హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం ఆలయ పనులను పరిశీలించిన ఈవో

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పనులను మంగళవారం ఈవో దామోదర్‌రావు పరిశీలించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో పనుల వేగం పెంచాలన్నారు. ఎక్కడా అలసత్వం వహించకుండా, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పనులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.