హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈ రోజైనా వైభవ్ సూర్యవంశీ రాణిస్తాడా..?

కాసేపట్లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్‌ను తప్పించి మరీ సూర్యవంశీకి జట్టులో అవకాశం ఇచ్చారు. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లోనైనా అతడు భారీ స్కోరు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.