హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: బస్ డ్రైవర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి

AP: విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో RTC అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఒడిశాకు చెందిన బులు సాహు(42) అక్కడికక్కడే మృతి చెందారు. స్పీడ్‌బ్రేకర్ ఉన్నా పట్టించుకోకుండా వేగంగా వచ్చిన బస్సు.. సాహు తలపై నుంచి దూసుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.