GNTR: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా ప్రతి అర్హ ఓటరు జూలై 14లోపు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలని మంగళగిరి-తాడేపల్లి కమిషనర్ ఎస్. అలీమ్ బాషా గురువారం కోరారు. ఫారం అందని వారు సచివాలయం, హెల్ప్డెస్క్ లేదా బీఎల్వోను సంప్రదించాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను కుటుంబ సభ్యులు అందజేయాలని తెలిపారు.
వార్తలు
'ఓటర్లు గడువులోగా ఫారం సమర్పించాలి'


