హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే భారత్, ఇంగ్లండ్ నాలుగో టీ20

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత జట్టు సిరీస్ రేసులో నిలవాలంటే ఈ నాలుగో మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. దీంతో టీమిండియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.