హైదరాబాద్: 28°C
క్రీడలు

పాలమూరుపై కరీంనగర్‌ ఘన విజయం

టీజీ20లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై కరీంనగర్‌ డైమండ్స్‌ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాలమూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. టాప్‌ఆర్డర్‌ విఫలమైంది. కరీంనగర్‌ బౌలర్లలో శుభమ్ శర్మ, దినేశ్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు.