హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌కు గాయం.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడేనా?

ఇంగ్లండ్‌తో మూడో టీ20కి ముందు భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, త్రో- డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి అతడి ఛాతిపై బలంగా తాకింది. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేనేజ్‌మెంట్ తెలిపింది. కొంత సేపు భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ, వైభవ్ మళ్లీ నెట్స్‌లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.