యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుత సిరీస్లో ఖచ్చితంగా అవకాశం వస్తుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, అతడిని జట్టులోకి తీసుకునే విషయంలో కోచింగ్ స్టాఫ్ సరైన సమాచారం ఇవ్వడం కీలకమన్నాడు. వైభవ్తో మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, ఆడించని పక్షంలో ముందే చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉందని పార్థివ్ సూచించాడు.
క్రీడలు
'సూర్యవంశీకి సరైన సందేశం ఇవ్వాలి'


